కాలనీలో మాదే అధిపత్యం.. అందుకే చంపేశాం : అవంతి తండ్రి !

-

హేమంత్ పరువు హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ రెండోరోజు నిందితులను ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇవాళో, రేపో నిందితులను ఘటనాస్థలి వద్దకు తీసు కెళ్లి సీన్ రీకన్‌ స్ట్రక్షన్ చేయనున్నారు. ఇక నిన్నటి విచారణలో కీలక విషయాలను రాబట్టారు. అవంతి ప్రేమ విషయం తెలిసి చాలా రోజులు కట్టడి చేశామని అయినా, తమ నుంచి తప్పించుకుని హేమంత్‌ను వివాహం చేసుకుందని లక్ష్మారెడ్డి పోలీసుల విచారణలో చెప్పాడు.

 

మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే అధిపత్యమన్న ఆయన వివాహం జరిగినట్లు పోలీసుల ద్వారా తమకు సమాచారం తెలిసిందనీ అవంతి ప్రేమ వ్యవహారంతో తమ కాలనీలో తలదించుకోవాల్సి వచ్చిందనీ పోలీసులతో చెప్పాడు లక్ష్మారెడ్డి. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హేమంత్‌ భార్య అవంతి, ఆయన కుటుంబ సభ్యులు మరోమారు పోలీసులను కోరారు. తనతో పాటు హేమంత్‌ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని సీపీని కోరిందామె. దీనికి స్పందించిన సజ్జనార్‌.. చందానగర్‌లోని హేమంత్‌ ఇంటిదగ్గర 24గంటల భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news