హనీమూన్ నుంచి మధ్యలోనే తిరిగి వచ్చేసిన బడా హీరో..కారణం..?

-

సాధారణంగా సామాన్య ప్రజల సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు వివాహం జరిగిన వెంటనే హనీమూన్ కి వెళ్తూ తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక హీరో హనీమూన్ కి వెళ్లి మధ్యలోనే తిరిగి వచ్చేసాడట. అసలు విషయం లోకి వెళ్తే..ఇక ప్రముఖ హీరో హీరోయిన్ అజయ్ దేవగన్ , కాజోల్ ఇప్పటికీ కూడా ఎంతోమందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు. ఇకపోతే వీరు కూడా పెళ్లికి ముందే హనీమూన్ కు ప్లాన్ వేసుకొని ట్రిప్ కు వెళ్లారట.. అయితే వివాహం తర్వాత వెళ్లే హనీమూన్ కోసం అయితే కాదండోయ్. సరదాగా ప్రపంచాన్ని చుట్టేద్దామని వీరు వెళ్లారట. ఇక టూర్ కి వెళ్లి 41వ రోజు వరకు ఇద్దరు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ మరింత ఎంజాయ్మెంట్ ను పొందారట ఈ జంట. ఇక ఈ క్రమంలోనే 41వ రోజు అజయ్ దేవగన్ బాగా అలసిపోయాడట..

రేపు ఇంటికి వెళ్దాం రెస్ట్ తీసుకో అని చెప్పిందట కాజోల్.. వామ్మో ఇక నా వల్ల కాదు తిరిగి తిరిగి నేను బాగా అలసిపోయాను.. నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను.. కావాలంటే నువ్వు రేపు రా అని చెప్పాడట అజయ్ దేవగన్.. ఇక ఆ సమయంలో కాజోల్ సరే అని ఒక్క మాట చెప్పి ఉంటే కాజోల్ ను విడిచి పారిపోయేవాడట అజయ్ దేవగన్.. అయితే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం..

ఇక కాజోల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలన్ గా కూడా మెప్పించిన విషయం తెలిసిందే . ఇక అజయ్ దేవగన్ స్టార్ హీరోగా కొనసాగుతూనే మరొక పక్క ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాలలో కీలక పాత్రలు కూడా పోషించాడు . ఇక ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version