విశాఖలో దారుణం.. నడి రోడ్డుపై ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల శవాలు !

-

విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. విశాఖ లోని పిఏం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద నడి రోడ్డు పై ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృత దేహాలు పడి ఉన్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే… ఈ ఘటనపై స్థానికులు వెంటనే… స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని .. దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులను మారిక వలస మధురవాడ ప్రాంతానికి చెందిన ధనరాజ్ ..వినోద్ గా గుర్తించారు పోలీసులు. వాహనం ఒక వైపు మృత దేహాలు మరో వైపు పడి ఉండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి ఈ తర్వాత ఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా… కావాలనే… హత్య యత్నం చేశారా ? లేక… ఆక్సిడెంట్‌ కారణంగా ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news