ఆ హీరోయిన్ పై కక్షగట్టి అలా చేశారు : న్యాయస్థానం

-

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కంగనా రనౌత్ మధ్య వివాదం నెలకొంది అన్న విషయం తెలిసిందే. శివసేన కు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ కంగనా రనౌత్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ముంబైలో ఉన్న కంగ నాకు సంబంధించిన కార్యాలయాన్ని కూల్చివేయడం కూడా.. మరింత చర్చనీయాంశంగా మారింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కంగనా రనౌత్ న్యాయ పోరాటం చేసింది.

ఇటీవలే ఇదే అంశంపై విచారణ జరిపిన ముంబై హైకోర్టు కంగనాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. కానీ కంగనాకు సంబంధించిన కార్యాలయాన్ని కూల్చివేయడం పూర్తిగా కక్షపూరితంగా చేసినట్లు స్పష్టం గా తెలుస్తోంది అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే అధికారులు కూల్చివేసిన కంగనా కార్యాలయాన్ని మళ్లీ పునర్నిర్మించాలని ఆమెకు జరిగిన నష్టాన్ని పూడ్చలంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. దీంతో కంగనాకు కోర్టులో ఊరట లభించినట్లయింది.

Read more RELATED
Recommended to you

Latest news