బ్రిటన్ అధికారులను పరిగెత్తించిన ఢిల్లీ మహిళ

-

ఢిల్లీకి చెందిన ఓ మహిళ.. బ్రిటన్​, భారత్​ దేశాల అధికారులను పరుగులు పెట్టించింది. తనకు సహాయం చేయమని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. ఏకంగా బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​కే ఈ-మెయిల్​ పంపించింది. చివరికి ఆమెను పట్టుకోవడానికి అర్ధరాత్రి వేళ ఢిల్లీ వీధులను అధికారులు జల్లెడ పట్టాల్సి వచ్చింది.రోహిణి సెక్టర్​-21లో నివాసముంటున్న ఆ మహిళ ఈ నెల 26వ తేదీన.. తనకు సహాయం చేయమని బ్రిటన్​ ప్రధానిని వేడుకుంది. లేఖలో ఆమె పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే.. ఆ మహిళ మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతుంది. మరో రెండు గంటల్లో సహాయం అందకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.ఈ-మెయిల్​ చూసిన బ్రిటన్​ ప్రధాని కార్యాలయం షాక్​కు గురైంది. వెంటనే లండన్​లోని భారత రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. వివరాలు తెలుసుకున్న రాయబార కార్యాలయం.. భారత విదేశాంగశాఖ అధికారులను సంప్రదించింది.

అయితే.. ఫోన్​ కాల్స్​ను ఆ మహిళ ఎత్తకపోవడం వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటిగంటకు.. ఇంటింటికీ వెళ్లి జల్లెడపట్టడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న సెక్యురిటీ గార్డులను ప్రశ్నించారు. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన అనంతరం చివరికి ఆ మహిళ ఉంటున్న అపార్ట్​మెంటును కనుక్కోగలిగారు పోలీసులు.ఆ తర్వాత కుడా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. తలుపు తెరిచేందుకు ఆ మహిళ నిరాకరించింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు పోలీసులు. వాళ్లు వచ్చి 10నిమిషాల్లో తలుపును బద్దలుకొట్టారు. అయినప్పటికీ.. వారందరినీ వెళ్లిపొమ్మని ఆ మహిళ పదేపదే అరిచింది.కౌన్సిలింగ్​ మొదలుపెట్టిన అనంతరం ఆమె ప్రవర్తనకు గల కారణాలు బయపడ్డాయి. వైవాహిక జీవితంలో సమస్యలు, ఆర్థిక సంక్షోభం వల్ల ఆ మహిళ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

Read more RELATED
Recommended to you

Latest news