గుడ్ న్యూస్ : త‌గ్గిన వంట నూనే ధ‌ర‌లు

-

సామ‌న్యులు భారంగా ఉన్న వంట నూనే ధ‌ర‌లు ఎట్టకేల‌కు త‌గ్గాయి. లీట‌రు కు దాదాపు రూ. 4 నుంచి రూ. 7 వ‌ర‌కు త‌గ్గ‌నున్నాయి. అయితే ఈ వార్త పండుగ స‌మ‌యంలో సామ‌న్య ప్ర‌జ‌ల‌కు కాస్త ఊర‌ట ల‌భించింది. ఈ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న‌ట్టు నూనేల త‌యారి సంస్థ‌లే ప్ర‌క‌టించాయి. ఆదానీ విల్మ‌ర్‌, రుచి సోయా ఇండ‌స్ట్రీస్ వంటి కంపెనీలు వంట నూనే ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తుంన్నామ‌ని ప్ర‌క‌టించారు.

అలాగే ఇత‌ర వంట నూనేల కంపెనీలు కూడా ధ‌ర‌లు తగ్గిస్త‌య‌ని ఎస్ఈఏ వెల్ల‌డించింది. అలాగే మ‌న హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా తో పాటు మ‌రి కొన్ని సంస్థలు కూడా ఇప్ప‌టికే వంట నూనేల ధ‌ర‌లు త‌గ్గించాయి. కాగ గ‌త కొంత కాలం నుంచి వంట నూనే ల ధ‌ర‌లు విప‌రీతం గా పెరిగి పోయాయి. దీంతో సామ‌న్యులు తీవ్ర ఇబ్బందులు ను ఎదుర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news