కఠిన నిబంధనలు నడుమ ప్రారంభమైన ముస్లింల పవిత్ర హజ్ యాత్ర

-

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. అయితే కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తున్నారు సౌదీ అధికారులు. ఇప్పటికే ఐసోలేషన్ పూర్తి చేసుకున్న యాత్రికులు.. మాస్కులు ధరించి చిన్న చిన్న బృందాలుగా పవిత్ర మక్కాను సందర్శించుకుంటున్నారు.

hajj yatra
hajj yatra

సాధారణంగా 40 రోజులపాటు సాగే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం చివరిదైన 12వ నెలలో చేసే మక్కా యాత్రను హజ్ అంటారు. 1,400 ఏళ్ల క్రితం మహ్మద్​ ప్రవక్త నడిచిన మార్గమని విశ్వసిస్తారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒకసారైనా హజ్‌ యాత్ర చేయాలన్నది నిర్దేశం.

కరోనా నేపథ్యంలో ఈసారి యాత్రను 5 రోజులకు కుదించారు. సాధారణంగా హజ్​ యాత్రలో సాధారణంగా లక్షల మంది పాల్గొంటారు. కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలను సౌదీ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.

కరోనా వ్యాప్తిని నివారించేందుకు యాత్రికులను 20 మందితో కూడిన చిన్న బృందాలుగా అనుమతి ఇస్తున్నారు. ప్రార్థనల సమయంలో ఒకరి నుంచి మరొకరు దూరాన్ని పాటించాలి. ముందుగానే ప్యాక్​ చేసిన భోజనాన్ని అందిస్తున్నారు. యాత్రికులకు సంబంధించి ప్రయాణ, బస, భోజన సదుపాయం, వైద్య ఖర్చులు సౌదీ ప్రభుత్వమే భరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news