భాగస్వామ్య దేశాలను గౌరవించడమే భారత విధానము: నరేంద్రమోదీ

-

అభివృద్ధి, సహకారంలో భాగస్వామ్య దేశాలను గౌరవించడమే భారత విధానమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మారిషస్​లో కొత్తగా నిర్మించిన సుప్రీంకోర్టును ఆ దేశ ప్రధాని ప్రవింద్ జుగ్​నౌథ్​తో కలిసి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు మోదీ. పొరుగు దేశాల అభివృద్ధికి సహకరించడంలో ఎలాంటి నిబంధనలు ఉండవని చెప్పారు.

pm modi
pm modi

మారిషస్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్​కు గుండె వంటిదన్నారు మోదీ. భారత్​, మారిషస్ ప్రజాస్వామ్యానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థలు మూలస్తంభాల వంటివని పేర్కొన్నారు. మారిషస్ ప్రభుత్వం కరోనాపై దీటుగా పోరాడుతోందని చెప్పారు.అఫ్గానిస్థాన్​లో పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేశామని.. నైగర్​లో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్​ను నిర్మించడం పట్ల గర్విస్తున్నామని తెలిపారు మోదీ.ఈ సందర్భంగా ప్రసంగించిన మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్​నౌథ్​ భారత్​పై ప్రశంసల జల్లు కురిపించారు. మారిషస్ దేశం, ప్రజలు భారత్​కు మద్దతుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news