వేసవిలో శివ పార్వతులుగా.. శీతాకాలంలో అర్ధనారీశ్వరులుగా దర్శనమిస్తున్న లింగం..!?

-

హిందూ సాంప్రదాయలకు భారతదేశం పెట్టింది పేరు. మన దేశం అనేక రహస్యాలకు కొలువైన గుప్తనిధి లాంటిది. ఒక్కొక్క రహస్యని చెడుస్తున్నప్పటికీ కొత్తకొత్తవి మళ్ళి పుట్టుకొస్తూనే ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాలకు నెలవే కాదు. అనేక పురాతన ప్రసిద్ధి ఆలయాలకు నిలయం. ఈ దేవాలయాలు అనేక అద్భుతాలు, రహస్యాలను తమలో దాచుకున్నాయి. అటువంటి ప్రసిద్ధి చేసిన పురాతన శివాలయం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శివుడు, పార్వతి కలిసి దర్శనమిస్తారు.

shiva

ఈ ఆలయంలో శివలింగం రెండు భాగాలుగా ఉంటుంది. ఇక్కడ పెద్ద లింగాన్ని శివుడిగా , చిన్నలింగాన్ని పార్వతిగా భక్తులు పూజిస్తుంటారు. అంతేకాదు 8 అడుగులు ఉన్న లింగాన్ని శివుడుగా 6 అడుగులున్న లింగాన్ని పార్వతిగా భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడ శివలింగం అష్టభుజి..అయితే ఈ ఆలయంలో నిర్దిష్ట సమయాల్లో ఓ అద్భుతం జరుగుతుంది.మారుతున్న కాలంతో పాటు అంటే వేసవికాలంలో లింగం విభజింపబడి రెండు లింగాలుగా మారతాయి. వీటి మధ్య దూరం పెరుగుతుంది.

ఇక మళ్ళీ శీతాకాలంలో ఆరెండు లింగాలు దగ్గరకు జరిగి.. ఏకలింగంగా మారతాయి. అందుకనే ఇక్కడ శివుడు అర్ధనారీశ్వరుడుగా పూజలను అందుకుంటున్నారు. శివ పురాణంలోని ఒక కథనం ప్రకారం, విష్ణువు , బ్రహ్మ దేవుడు మధ్య తమలో ఎవరు గొప్ప అనే అంశంపై వాదన చోటు చేసుకుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరూ యుద్ధాన్ని దిగారు. దీంతో ప్రకృతి భయకంపితురాలైంది. ఈ సమయంలో శివుడు రంగంలోకి దిగి.. బ్రహ్మ, విష్ణువుల మధ్య అగ్ని స్తంభంగా దర్శనమిచ్చాడు. తమ మధ్యలో ఉద్భవించిన అగ్ని స్థంభం ఏమిటో తెలుసుకోవాలని విష్ణువు అడుగున ఆరాతీయడానికి.. బ్రహ్మ పై భాగానికి వెళ్లారు..

అయితే ఇద్దరూ ఆది, అంతం కనిపెట్టలేక తిరిగి యధాస్థానికి చేరుకున్నారు. బ్రహ్మ దేవుడు మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకుని వచ్చాడు. ఇద్దరూ రాజీ పడ్డారు.. అప్పుడు లయకారుడు తన నిజస్వరూపం తో విష్ణు, బ్రాహ్మలు దర్శనమిచ్చిన ప్రాంతంఇది అని పురాణ కథనం. ఇక్కడ ఆలయం రోమన్ ఆర్కిటెక్ కల్చర్ తో నిర్మించారు. బియాస్, చోచ్ నదుల సంగమ ప్రాంతంలో అర్ధనారీశ్వరుడుగా కొలువై ఉన్నాడుని అక్కడి ప్రజలు చెబుతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news