పెన్ను పోయిందని కేసు పెట్టిన ఎంపీ.. ధర లక్షన్నరకు పైనే

-

తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన పెన్ను పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా.. ఆ పెన్ను విలువ అక్షరాల లక్షా యాభై వేల రూపాయలని, అది తన తండ్రి జ్ఞాపకార్థం ఇచ్చిన కలమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఎన్నికల్లో మద్దతు కోరేందుకు చెన్నై వచ్చారు.

ఈ సందర్భంగా గిండీ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో స్వాగతం పలికిన సమయంలో ఆ పేరు ఎవరో దొంగిలించారని పేర్కొన్నారు. ఆ పెన్ను ను తన తండ్రి తనకు బహుమతిగా ఇచ్చారని, కాబట్టి అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఎంపీ విజయ్ వసంత్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news