గచ్చిబౌలి హోటల్‌‌లో యువతి అనుమానాస్పద మృతిపై వీడిన మిస్టరీ!

-

నగరంలోని గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్లో యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇది హత్య కాదని, ఆత్మహత్యేనని పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని తేల్చారు. ప్రియుడు జీవన్‌తో కలిసి శృతి రెడ్‌స్టోన్ హోటల్‌కు వెళ్లగా అక్కడ వీరిద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని జీవన్‌పై శృతి ఒత్తిడి చేయగా..అతడు నిరాకరించడంతో ఆమె మనస్తాపం చెంది ఆత్యహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు.

తొలుత యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావింగా..కుటుంబ సభ్యులు మాత్రం తమ బిడ్డపై హత్యాచారం జరిగిందని ఆరోపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. తీరా విచారణలో శృతిది ఆత్మహత్యేనని తేలింది.‘జడ్చర్లకు చెందిన శృతి (23) గత ఆదివారం గణేశ్‌ నిమజ్జన వేడుకలకు చూసేందుకు తన ఫ్రెండ్ మోనా, జీవన్‌‌తో కలిసి వచ్చింది.వీరు రెడ్‌స్టోన్ హోటల్‌లో రెండు గదులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జీవన్,శృతి మధ్య పెళ్లి టాపిక్ వచ్చింది. పెళ్లికి జీవన్‌ నో అనడంతో శృతి క్షణికావేశంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news