ఈనెల 23 నుంచి పోలం పిలుస్తోంది కార్యక్రమం..మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

-

“పోలం పిలుస్తోంది” కార్యక్రమం ఈనెల 23నుంచి నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి తెలిపారు. ఎరువులు, విత్తనాలు రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే దిశగా రైతులను ముందుకు నడిపించడమే “పొలం పిలుస్తోంది” కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news