వైఎస్ జగన్ చివరకు దాన్ని.. కూడా తాకట్టు పెట్టారు : భీమవరం ఎమ్మెల్యే

-

ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.సంక్షేమం ఏదో చేశామని చెప్పుకుంటున్నారని.. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ గతంలో చంద్రబాబు చేసినవేనని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసింది ఏమీ లేదని అన్నారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆశా భావం వ్యక్తం చేశారు.పేరుపాలెం బీచ్ నుంచి తాడేపల్లిగూడెం వరకు ఫోర్ లైన్స్ వేయటానికి ఆలోచన చేస్తున్నామని,తమను ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించింది వారి సమస్యలను పరిష్కరించడానికేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news