శ్రీదేవి,జయప్రద మధ్య విభేదాలు రావడానికి కారణం..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి, జయప్రద ఇద్దరూ కూడా స్టార్ హీరోయిన్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలలో కూడా నటించారు. అయితే వీరిద్దరూ కూడా అనుకోని పరిస్థితుల్లో ఒకేసారి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ మాత్రం శ్రీదేవి స్టార్ హీరోయిన్ అవ్వగా జయప్రద మాత్రం కొద్దిరోజులే తన హవా కొనసాగించింది. ఇక అలా ఇద్దరు కలిసి ఎన్నో చిత్రాలలో నటించినా వీరిద్దరికీ అసలు పడేది కాదట. వీరిద్దరూ కలిసి తెరమీద ఎంతో అన్యోన్యంగా కనిపించినా అది కేవలం షూటింగ్ వరకు మాత్రమే ఉండేది. వీరిద్దరూ బయట అసలు ఒకరినొకరు మాట్లాడుకునే వారు కూడా కాదట. అయితే వీరిద్దరికీ గల గొడవకు కారణాలు ఏంటో తెలుసుకుందాం.

అతి తక్కువ సమయంలోనే శ్రీదేవి తెలుగు , తమిళంలో బాగా మంచి పేరు తెచ్చుకుంది. అలా కలిసి వచ్చిన చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తీశారు. ఆ సినిమాలో అమూల్ పాలేకర్ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో చంద్రమోహన్ చేసిన పాత్రని ఈ నటుడు నటించాడు అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ సమయంలోనే జయప్రద హిందీలో సర్గమ్ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వగా.. పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా తెలుగులో సిరిసిరిమువ్వగా తెరకెక్కించడం జరిగింది.

ఇక బాలీవుడ్లో శ్రీదేవి కన్నా జయప్రధకి కాస్త పాపులారిటీ ఉండడంతో ఆ తర్వాత శ్రీదేవి హిమ్మత్ వాలా, జస్టిస్ చౌదరి, మవాలి తదితర సినిమాలలో నటించింది. ఈ చిత్రాలు పద్మాలయ స్టూడియోలో నిర్మించారు. ఈ సినిమాలు మంచి హిట్ అవడంతో శ్రీదేవి ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దీంతో జయప్రద కాస్త వెనుకబడిపోయింది. దీంతో జయప్రద నేను పుట్టుకతోనే అందంగా ఉంటాను.. శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందం తెచ్చుకుంది. తనకు నాకు పోలిక ఏంటి అంటూ కొన్ని మాటలు మాట్లాడిందట. ఈ మాటలు విన్న శ్రీదేవి అప్పటినుంచి ఆమెతో మాట్లాడలేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news