చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం..!

-

సంగారెడ్డి జిల్లా రాళ్లకత్వలో నర్సాపూర్ డిపో కి చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు కండక్టర్ మీడియాకి సమాచారం అందించారు.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ప్రయాణికులు అతనిపై దాడి చేశారని పేర్కొన్నాడు. అనంతరం ఆయనను కారులో ఆసుపత్రికి తరలించారని కండక్టర్ వెల్లడించారు. అసలు బస్సు ఎందుకు అదుపు తప్పిందనే విషయం మాత్రం తెలియదని ప్రయాణికులు పేర్కొంటున్నారు.  ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడంతో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రయాణికుల వద్ద వివరాలను సేకరించారు. ఇచ్చిన వివరాల మేరకు జిన్నారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news