ప్రతిపక్ష నేతను కలిసిన అధికార పార్టీ ఎంపీ…?

-

మహారాష్ట్రలో ఇప్పుడు అధికార విపక్షాలు మాటల యుద్ధం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఎక్కువగా విమర్శలు చేసుకునే పరిస్థితి అక్కడ ఉంది. సుశాంత్ సింగ్ మరణం సహా కరోనా వ్యవహారం అన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా దూకుడుగా వెళ్తుంది. దీనితో విపక్ష బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుంది. ఈ తరుణంలో శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక అడుగు వేసారు.

కొన్ని విషయాల గురించి చర్చించడానికి నిన్న విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ను కలిశాను అని చెప్పారు. ఆయన మాజీ సీఎం… అలాగే, అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. బీహార్ పోల్స్ లో కీలకంగా ఉన్నారు. సైద్ధాంతిక భేదాలు ఉండవచ్చు కాని మేము శత్రువులు కాదని అన్నారు. మా సమావేశం గురించి సిఎంకు తెలుసు అని సంజయ్ రౌత్ స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news