తెలంగాణ మహిళలకు కేసిఆర్ శుభవార్త.. రేపు ప్రభుత్వ సెలవు ఇస్తూ నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మంగళవారం అంటే రేపటి రోజున శెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మహిళా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇస్తోంది.

ఇందులో భాగంగానే రేపటి రోజున సెలవు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నేపథ్యం లో.. తెలంగాణ రాష్ట్రంలో ” కేసీఆర్‌ మ‌హిళా బంధు” అనే పేరుతో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రేపు కేసిఆర్ కిట్, కల్యాణలక్ష్మి థాంక్యూ, కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటుచేయనున్నారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.

 

Read more RELATED
Recommended to you

Latest news