దుర్గం చెరువు విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం

-

దుర్గం చెరువు విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై ఆదివారం మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జి పై ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ ఉంటుంది. లైవ్ బ్యాండ్ ప్రదర్శనకు ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని అధికారులు కోరారు.

నార్తన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావంగా బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది. 45 నిమిషాల పాటు ప్రదర్శన ఉంటుంది. వందేమాతరం తో ప్రారంభించి పలు దేశ భక్తి, భారతీయ , పాశ్చాత్య గీతాలు, మరియు సంగీతాన్ని ప్రదర్శించి “జయ హో ” తో ముగింపు పలకాలని, ప్రవేశం ఉచితం అని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news