విషాదం : పెళ్లయిన మూడు నెలలకే తనువు చాలించింది..!

-

చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. కోటి ఆశలతో ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుంది ఆ యువతి. ఇక అటు తల్లిదండ్రులు కూడా తమ కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టామని ఎంతో సంతోష పడి పోయారూ. ఇక తమ కూతురు ఎంతో ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడుపుతుంది అని అనుకున్నారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ యువతి కొన్ని రోజులలోనే తనువు చాలించింది.

పెళ్లయిన మూడు నెలలకు నవ వధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ ప్రాంతంలో రాఘవేంద్ర సుకన్య దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వీరికి మూడు నెలల క్రితమే పెళ్లయింది. అయితే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న రాఘవేంద్ర ఇటీవలే డ్యూటీకి వెళ్లిన సమయంలో భార్య ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక భర్త తిరిగి వచ్చేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో షాక్ అయిన భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news