జై బాలయ్య అన్నందుకు “వీర సింహారెడ్డి” సినిమాను ఆపేసిన థియేటర్ ఓనర్ !

-

నందమూరి బాలయ్య ,గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా వీర సింహారెడ్డి..భారీ అంచనాలతో ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఉదయం 4 గంటలకే మొదటి షో పడింది..ఎప్పటిలాగే ఫ్యాన్స్ హంగామా తారా స్థాయికి చేరింది..సంక్రాంతి పండగను అభిమానులకు రెండు రోజుల ముందే తెచ్చింది ఈ చిత్రం.

అయితే అమెరికాలో బాలయ్య అభిమానులు కూడా సినిమా థియేటర్లలో హంగామా చేశారు. థియేటర్ మొత్తం కాగితాలు విసిరి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయగా సినిమా ప్రదర్శన నిలిపివేసిన యాజమాన్యం… ప్రేక్షకులను బయటకు పంపించేసింది. గతంలో తాము చాలా తెలుగు సినిమాలను ప్రదర్శించామని… ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని యాజమాన్యం వెల్లడించింది. అలాగే మరో థియేటర్లో జై బాలయ్య అని అరవకూడదని థియేటర్ ఓనర్ సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news