BREAKING : రజనీకాంత్ కూతురు ఇంట్లో దొంగతనం

-

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు, ఫిల్మ్ మేకర్ అయిన ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఉన్న డైమండ్స్, బంగారాన్ని దొంగలు దోచుకెళ్ళారు. అయితే ఆ దొంగలు కూడా తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులపైనే అనుమానం ఉందని ఐశ్వర్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దాదాపు రూ. 7 లక్షల విలువైన నగలు, వజ్రాలను తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో తెలిపింది. 2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లి తర్వాత ఆ నగలను తన లాకర్ రూమ్ లో పెట్టానని తెలిపింది. 2021 ఆగస్టు వరకు ఆ లాఖర్ సెయింట్ మేరీస్ రోడ్డులో ఉన్న తన అపార్ట్మెంట్ లోనే ఉందని, ఆ తర్వాత నటుడు ధనుష్ తో ఉన్నప్పుడు దాన్ని అక్కడికి మార్చినట్లు పేర్కొంది. మళ్ళీ అక్కడి నుంచి 2021 సెప్టెంబర్ లో తిరిగి సెయింట్ మేరీస్ రోడ్డులో ఉన్న తన అపార్ట్మెంట్ లోకి చేర్చాలని తెలిపింది. 2022 ఏప్రిల్ 9న రజనీకాంత్ పోస్ గార్డెన్ ఇంటికి షిఫ్ట్ చేసినట్లు ఐశ్వర్య లక్ష్మి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news