బుమ్రా లాంటి బౌలర్ తరానికి ఒక్కడే ఉంటారు : అశ్విన్

-

భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో దిగ్గజ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాపై పొగడ్తల వర్షం కురిపించాడు. బుమ్రా ఒక అరుదైన బౌలర్ అని ప్రశంసించారు. అటువంటి బౌలర్ తరానికి ఒక్కరే వస్తుంటారని కొనియాడారు. ప్రతిఒక్కరూ అతని గొప్పదనాన్ని గుర్తించాలన్నారు.‘భారత్ ఎప్పుడూ బ్యాటర్లకే గుర్తింపు, స్టార్ స్టేటస్ ఇస్తుంటుంది. అది ఎప్పటికీ మారదు. కానీ బౌలర్ అయిన బుమ్రాకు కూడా గౌరవం దక్కుతుందటం ఆనందంగా ఉంది. నా దృష్టిలో ప్రస్తుతం అతడే అత్యంత విలువైన భారత క్రికెటర్’ అని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, అశ్విన్ ప్రస్తుతం టీమిండియా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ ఆయన జట్టుకు ఎంపిక కాలేదు. టెస్టుల్లోనూ ఎక్కువగా కనిపించడం లేదు. అయితే, అశ్విన్ రాక కోసం అతని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.జాతీయ జట్టులో అశ్విన్ కు చోటు దక్కకపోయినా ఇండియన్ ప్రీమియర్ లీగులో మాత్రం అశ్విన్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version