క్రిస్మస్ పండుగ సందర్భంగా ఓటీటీ/ థియేటర్ లలో వచ్చే చిత్రాలు ఇవే..!

-

క్రిస్మస్ పండుగ సందర్భంగా థియేటర్లలో సందడి చేయడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే థియేటర్లలో అవతార్ 2 అలరిస్తుండగా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచడానికి కొత్త సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. వాటితో పాటు ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ అవ్వడానికి మరికొన్ని చిత్రాలు సిద్ధమవుతున్నాయి. మరి వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

విశాల్ లాఠీ:
విశాల్ హీరోగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న తమిళ్ చిత్రం లత్తి.. ఈ సినిమాని తెలుగులో లాఠీ పేరిట రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా 2022 డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది.

నయనతార కనెక్ట్:
నయనతార లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న కనెక్ట్ సినిమా 22 డిసెంబర్ విడుదల కాబోతోంది . హారర్ మూవీ గా వస్తున్న ఈ సినిమా బ్రేక్ లేకుండా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

రవితేజ ధమాకా:
రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 23 డిసెంబర్ న రిలీజ్ కాబోతోంది.

నిఖిల్ 18 పేజెస్:
నిఖిల్ సిద్ధార్థ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం 18 పేజీస్ ఈ సినిమా 23 డిసెంబర్ న రిలీజ్ కాబోతోంది.

రన్వీర్ సింగ్ సర్కస్:
రణ్వీర్ సింగ్ , పూజా హెగ్డే కలిసి నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23న రిలీజ్ కాబోతోంది.

ఓటీపీలో విడుదలయ్యి చిత్రాలు విషయానికి వస్తే..

సంగీత మసూద:
సంగీత లీడ్రోల్ పోషించిన మసూదా చిత్రం డిసెంబర్ 21న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

జయ జయ జయ జయహే:
బసిల్ జోసెఫ్, ఘర్షణ రాజేంద్రన్ జంటగా నటించిన ఈ చిత్రం నెట్ ఫ్లెక్స్ వేదికగా డిసెంబర్ 22న స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ లో టామ్ క్లాన్సిస్ జాక్ ర్యాన్ డిసెంబర్ 21న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news