జగన్ సర్కార్ కీలక నిర్ణయం..సచివాలయాల సిబ్బందికి కీలక బాధ్యతలు

-

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాల సిబ్బందికి కీలక బాధ్యతలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో బోధనేతర కార్యక్రమాలను గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం అప్పగించింది.

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ స్కూలులో పిల్లల హాజరును పరిశీలించి, మధ్యాహ్న భోజన రికార్డులను చూడాలి. భోజనం రుచిగా, శుచిగా ఉందా? అనేది గమనించాలి. మహిళా పోలీస్ విద్యార్థినులతో తరచూ బేటిలు నిర్వహించి, భద్రతపై అవగాహన కల్పించాలి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు టాయిలెట్ల పరిశుభ్రతను చూడాలి. ఇక కీలక బాధ్యతలు ఇస్తూ నిర్ణయం తీసుకున్న సర్కార్‌ పై గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news