టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..!!

-

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ వెల్లడించారు. నేడు ప్రగతిభవన్‌లో జరిగిన సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో పేర్లను ఖరారు చేశారు. తెరాస పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా.. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, అలాగే వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పేర్లను సీఎం కేసీఆర్ వెల్లడించారు.

mp-candidates

అలాగే ఎప్పటి మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని, పురోగతిని ప్రజలకు తెలియజేయాలన్నారు.

cm-kcr-telangana

వీటికి సంబంధించిన ప్రసంగాలు జిల్లా కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారు చేయాలన్నారు. అలాగే హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి, జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలు హాజరు కావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version