రాయ్ బరేలీని తమ ఫ్యామిలీ ప్రాపర్టీ అనుకుంటున్నారు : ప్రధాని మోడీ

-

కొవిడ్ తరువాత తన నియోజకవర్గం రాయ్ బరేలీని సోనియాగాంధీ ఒక్కసారి కూడా సందర్శించలేదని పీఎం మోడీని విమర్శించారు. ఇప్పుడు వచ్చి తన కొడుకును మీకు అప్పగిస్తున్నానని చెబుతున్నారు. ఇన్నేళ్ల నుంచి స్థానికంగా ఒక్క నేతను కూడా తయారుచేసుకోలేదా..? వాళ్లు ఆ సీటును తమ ఫ్యామిలీ ప్రాపర్టీ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. వారసత్వ పార్టీలను ప్రజలు తిరస్కరించాలని జంషెడ్ పూర్ ర్యాలీలో మోడీ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి కుంభకోణం జరిగిందని తెలిపారు. దేశంలో బీజేపీ 400 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని తెలిపారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version