ఇవాళే మూడో టీ-20 : సిరీస్ పై కన్నేసిన ఇండియా

-

నిన్న కొలంబో వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా జట్టు శ్రీలంకపై పరాజయం చెందిన సంగతి తెలిసిందే. దీంతో 1-1 తో సిరీస్ సమం చేసింది శ్రీలంక జట్టు. అయితే ఇవాళ అ ఆ ఇ ఈ రెండు జట్ల మధ్య మూడో టి 20 మ్యాచ్ జరగనుంది. అంతేకాదు ఈ సిరీస్ లో ఇది చివరిది. దీంతో ఈ చివరి మ్యాచ్… ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా జట్టు బలమైన ఆటగాళ్ళు ఉండడంతో అవలీలగా గెలిచింది.

క్రునాల్ పాండ్యా కు కరోనా సోకడంతో ఇతడితో పాటు మరో ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లు… సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఇందులో భాగంగానే నిన్న జరిగిన రెండో టి20 మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ రోజు కూడా స్టార్ ఆటగాళ్లు టీమిండియా కు దూరం కానున్నారు. దీంతో రెండో టీ20 మ్యాచ్ జట్టునే చివరి టి20లో ను కొన సాగించే యోచనలో శిఖర్ధావన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ యువ క్రికెటర్లు తమ సత్తా చాటితేనే టీమిండియా సిరీస్ గెలిచారు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా కొలంబో వేదికగా ఇవాళ రాత్రి 8 గంటల సమయంలో శ్రీలంక మరియు టీమిండియా మధ్య మూడో టి20 ప్రారంభంకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news