ప్రభాస్‌-మారుతి సినిమాలో మూడో హీరోయిన్ గా ఈ భామ..?

-

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి సంబంధించిన వార్తలు కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికార ప్రకటన రాకపోయినప్పటికీ సినిమా షూటింగ్ అయితే మొదలైందని తెలుస్తోంది అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ప్రభాస్ మారుతి కాంబినేషన్లో నిజంగానే సినిమా రాబోతుందా అనే వార్తలకు తెరదించుతూ గత కొన్ని రోజులు క్రితం ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైన సంగతి తెలిసిందే.. అలాగే ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్‌ షెడ్యూల్‌లో ప్రభాస్‌ మూడు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడట. అలాగే మొదటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతోంది చిత్ర బృందం.. అయినప్పటికీ కొన్ని విషయాలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి..

ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ఇప్పటికే మాళవికా మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్‌లుగా కన్ఫార్మ్ అయినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఫిక్సయిందట. ఆమె ఎవరో కాదు.. లవర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన రిద్దీ కుమార్‌ను మూడో హీరోయిన్‌గా మేకర్స్ అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై అధికారం ప్రకటన రావాల్సి ఉంది.. ఇక ఇటీవలే రాధేశ్యామ్‌లోనూ ఈమె తారా పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో ఆర్చర్‌ అవ్వాలనుకున్న రిద్ధీ ట్రైన్‌ యాక్సిడెంట్‌లో చేయి పోగోట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌కు జోడీగా చేయనుంది.. హార్రర్ క‌మెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తుంది.. ఈ చిత్రానికి రాజాడిలక్స్ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలనలో ఉంచినట్లు టాక్‌.

Read more RELATED
Recommended to you

Latest news