Big Boss Non Stop: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్..ఈ సారి డబుల్ ఎలిమినేషన్!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’..ఆరో సీజన్ ‘ఓటీటీ’ వర్షన్ కొనసాగుతోంది. ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయిన షోలో..కంటెస్టెంట్స్ తమ గేమ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేస్తున్నారు. ఏడో వారం సింగిల్ ఎలిమినేషన్ జరిగింది. మహేశ్ విట్టా హౌజ్ నుంచి బయటకు వెళ్లగా, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బాబా మాస్టర్ ఇంటిలోకి వెళ్లారు.

ఇక ఇప్పటి వరకు అయిన ఓటింగ్ పర్సంటేజీ పరంగా అఖిల్, అనిల్ మధ్య పోటా పోటీ సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. బిందు మాధవి సైతం దూసుకుపోతున్నది. గత కొద్ది రోజులుగా గేమ్ లో సత్తా చాటుతున్న బిందు మాధవియే డెఫినెట్ గా టైటిల్ విన్ అవుతుందని కొందరు బీబీ లవర్ష్, బిందు సపోర్టర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు వార్తలు కూడా ప్రసారం చేస్తున్నారు.

ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఎలా ఉండబోతున్నదన్న చర్చ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఈ సారి కూడా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? అని అనుకుంటున్నారు. ఒక వేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే కనకు అజయ్ డేంజర్ జోన్ లో ఉన్నాడని పేర్కొంటున్నారు.

డబుల్ ఎలిమినేషన్ అయితే అషురెడ్డి, అజయ్ ..ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. కాగా, ఈ వారంలో అప్పటి వరకు ఆట సమీకరణాలు మారే అవకాశాలూ ఉంటాయి. ‘బిగ్ బాస్’ ఇచ్చే టాస్కుల్లో వారి పర్ఫార్మెన్స్ , ఆడియన్స్ ఓటింగ్ ప్రభావితం చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news