మహేష్ బాబు కోసం ముగ్గురు డైరెక్టర్లు రెడి ..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సమ్మర్ వెకేషన్, లాక్ డౌన్ .. ఇలా అన్ని కలిసొచ్చి బాగా రిలాక్స్ అవుతున్నాడు. గత సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సస్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళాల్సింది మహేష్ బాబు. కాని వంశీ పైడి పల్లి రెడి చేసిన ఫుల్ స్క్రిప్ట్ మహేష్ బాబు కి తృప్తినివ్వకపోవడం తో నిర్మొహమాటంగా నో చెప్పాడు. ఇక ఈ సినిమా క్యాన్సిల్ అవగానే ఎఫ్ 3 లో నటించబోతున్నారని, అలాగే కొరటాల శివ చిరంజీవి సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే అధికారకంగా ఏదీ ప్రకటించలేదు.

 

ఇక లాక్ డౌన్ తర్వాత మాత్రం గీత గోవిందం ఫేం పరశురాం తో మహేష్ బాబు సినిమా ఉండబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారక ప్రకటన రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మరో ఇద్దరు డైరెక్టర్స్ కూడా మహేష్ కోసం రెడీ అవుతున్నారు. వాళ్ళలో ఒకరు కొరటాల శివ, మరోకరు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా రౌద్రం రణం రుథిరం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం షూటింగ్ కంప్లీటవగా మిగిలిన భాగాన్ని పూణె దగ్గర్లో ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా ఈ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడే మొత్తం షూటింగ్ ఫినిష్ చేస్తారట.

 

ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డా.కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వాస్తవంగా ఈ కాంబినేషన్ లో మహేష్ బాబు 25 వ సినిమాని నిర్మించాలనే అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేదు. ఇప్పటికి ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఇక కొరటాల శివ కూడా తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆచార్య తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా మొదలయ్యో అవకాశాలున్నాయిని సమాచారం. మొత్తానికి ప్రస్తుతం మహేష్ బాబు కోసం ముగ్గురు రెడి అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news