శానిటైజర్ తాగి ముగ్గురు మృతి… రహస్యంగా అంత్యక్రియలు…!

-

మద్యం దొరకక శానిటైజర్ తాగి వరుసగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటీవల ప్రకాశం జిల్లా కురుచేడు లో 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరి కొంత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి.కడప  జిల్లాలో ఒక ఘటన జరిగింది. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ఓబులేశు, భీమయ్య, చెన్నకేశవులు అనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

అయితే వీరు అది తాగి ప్రాణాలు కోల్పోయారు అనే విషయం మాత్రం ఎవరూ బయటపెట్టలేదు. ప్రకాశం జిల్లా ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఇప్పుడు తమను ఎక్కడ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందో అని భయపడి… ఈ విషయాన్ని వాళ్ళు బయటపెట్టలేదు. తర్వాత గ్రామానికి చెందిన కొందరు… పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే గ్రామంలో మొత్తం పది మంది వరకు శానిటైజర్ తాగారు అని పోలీసులు గుర్తించారు. రహస్యంగానే అంత్యక్రియలు నిర్వహించారట.

Read more RELATED
Recommended to you

Latest news