జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. రాష్ట్ర పండుగగా తిరుపతి గంగ జాతర

-

జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పండుగగా తిరుపతి గంగ జాతరను గుర్తించింది జగన్‌ సర్కార్‌. తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది జగన్‌ ప్రభుత్వం. ఇక నుంచి అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది ఎమ్మెల్యే భూమన విజ్ఞప్తి మేరకు గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సిఎం జగన్ గంగమ్మ పండుగా రాష్ట్ర పండగ గుర్తించాలని కోరారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి. సిఎం జగన్ అమ్మవారి గుర్తించి రాష్ట్ర పండుగగా గుర్తించడంతో గంగమ్మ జాతరఅత్యంత వైభవం జరుపనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే భూమన.

Read more RELATED
Recommended to you

Latest news