ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉన్నాను..వైసీపీపై నారాయణ స్వామి సంచలనం

-

జ్షానేంద్రరెడ్డి మాటలకు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి ఇచ్చారు. జిడినెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామికి వ్యతిరేకంగా డైరెక్ట్ వార్ కు సీనియర్ నేత మాజీ ఎంపి, ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారుడు జ్ఞానేంద్రరెడ్డి దిగారు. ఇక దీనిపై నారాయణ స్వామి మాట్లాడుతూ.. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉన్నానని.. దళితుడనే కదా నన్ను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహించారు.

తాను పుట్టినప్పటి నుంచి పెత్తందార్లకు వ్యతిరేకినని.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తానన్నారని తెలిపారు. మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డిలా తాను పార్టీలు మారలేదని, అమెరికా, బెంగళూరుల్లో వ్యాపారాలు చేసుకుంటూ మిగిలిన సమయంలో నియోజకవర్గంలో తిరగడం లేదని తెలిపారు. ‘నామీద ఆయనకు ఎందుకింత కక్ష? ఆయన ఇంట్లోవాళ్లందరికీ పదవులు ఇస్తేనే పార్టీలో అందరినీ కలుపుకుని పోయినట్లా? లేకపోతే లేదా’ అని ప్రశ్నించారు నారాయణ స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news