ఇవాళ మరోసారి ఈడి ముందుకు కల్వకుంట్ల కవిత

-

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారనలో భాగంగా నేడు మరోసారి ఈడీ ముందు ఎమ్మెల్సీ కె.కవిత హజరుకానున్నారు. నిన్న 9 గంటల పాటు విచారించిన ఈడీ.. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో తలకుంట్ల కవిత మరోసారి ఈ డి విచారణకు వెళ్లనుంది.

ఇక ఇవాళ ఈడీ కార్యాలయానికి వెళ్ళే ముందు కవిత మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా నిన్న కూడా ఉదయం 11 గంటల సమయంలో కల్వకుంట్ల కవిత ఈడి విచారణకు వెళ్ళింది. అర్ధరాత్రి వరకు కల్వకుంట్ల కవితను నిన్న విచారణ చేశారు. ఈ తరుణంలోనే ఆమెను నిన్న అరెస్టు చేస్తారని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈడీ ఆ నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కాస్త ఊపిరి పీల్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news