IND VS SL : నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20.. ఆ కీలక ఆటగాళ్లు దూరం !

-

ఇవాళ శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌ పై వన్డే, టీ 20 సిరీస్‌ లు సొంతం చేసుకున్న టీమిండియా.. శ్రీలంకపై పోరుకు సిద్ధం అయింది. లక్నో లోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో ఇవాళ మ్యాచ్‌ జరుగనుంది. సాయంత్రం 7 గంటల సమయంలో.. ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌ కు కోహ్లీ, పంత్‌, చాహర్‌ దూరం కానున్నారు.

జట్ల అంచనా :

ఇండియా జట్టు : రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (WK), శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ (C), సంజు శాంసన్, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, కమిల్ మిషార (WK), దినేష్ చండిమాల్, చరిత్ అసలంక, దసున్ షనక (C), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార

Read more RELATED
Recommended to you

Latest news