‘భీమ్లానాయక్’ కి షాక్‌…షోలు రద్దు చేయాలని థియేటర్లకు జగన్‌ సర్కార్‌ నోటీసులు !

-

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ కి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. ఈ మూవీ విడుదల కాకముందే.. జగన్‌ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. ‘భీమ్లానాయక్’ మూవీ విడుదల కాబోతున్న అన్ని థియేటర్లకు జగన్‌ సర్కార్‌ ముందస్తు నోటీసులు జారీ చేసింది. ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలకు సంబంధించి నోటీసులు జారీ చేసింది సర్కార్‌.

సినిమాకు బెనిఫిట్ షో, అదనపు షోలు వేయ రాదని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని థియేటర్లకు నోటీసులు ఇచ్చింది. టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసుల్లో వెల్లడించింది సర్కార్‌.

థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఏపీలో భీమ్లానాయక్ సినిమాకు జీవో నంబర్ 35 ప్రకారం పాత టిక్కెట్ ధరలే అమలు చేయాలని థియేటర్లకు రెవెన్యూ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ‘భీమ్లానాయక్’ మూవీ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news