ALERT : నేడే శ్రీ‌వారి అర్జిత సేవా టికెట్లు ఆన్ లైన్‌లో విడుద‌ల‌

-

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం లో శ్రీ వారి అర్జిత సేవ‌ల‌కు టికెట్ల‌ను టీటీడీ నేటి నుంచి ఆన్ లైన్ లో ఉంచ‌నుంది. కాగ క‌రోనా వ్యాప్తి కార‌ణంగా 2020 నుంచి శ్రీ వారి అర్జిత సేవ‌ల‌ను నిలిపివేశారు. కాగ ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం పెట్టిన నేప‌థ్యంలో శ్రీ వారి అర్జిత సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి శ్రీ వారి అర్జిత సేవ‌ల‌ను తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగ ఏప్రిల్, మే, జూన్ మూడు నెల‌ల‌కు సంబంధించి అర్జిత సేవ‌ల టికెట్ల‌ను టీటీడీ నేటి నుంచే అందు బాటులోకి తీసుకురానున్నారు.

ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో అర్జిత సేవల టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు. నేడు ఉద‌యం 10 గంటల నుంచి 22 వ తేదీ ఉద‌య 10 గంట‌ల వ‌ర‌కు ఆన్ లైన్ లో టికెట్లు ల‌భ్యం అవుతాయి. అర్జిత సేవ‌ల టికెట్ల కోసం కేవ‌లం రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌నుంది. కాగ అర్జిత సేవా టికెట్లును ఎల‌క్ట్రానిక్ లాట‌రీ ప‌ద్ద‌తి ద్వారా భ‌క్తుల‌కు కేటాయిస్తారు. కాగ శ్రీ వారి అర్జిత సేవ‌ల టికెట్లు పొందిన వారి వివ‌రాల‌ను 22వ తేదీన ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత టీటీడీ విడుద‌ల చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news