కమెడియన్ గీతాసింగ్​​ ఇంట విషాదం

-

టాలీవుడ్ కమెడియన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ విషయాన్ని మరోనటి కరాటే కల్యాణి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ‘దయచేసి కార్‌లో అయినా బైక్‌లో అయినా జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు.. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓం శాంతి’ అని కరాటే కళ్యాణి తన పోస్టులో తెలిపారు.

గీతాసింగ్‌కు పెళ్లికాలేదు. తన అన్నయ్య అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఆయన ఇద్దరు పిల్లలను పెంచుకుంటున్నారు. ఆ ఇద్దరు పిల్లలతో పాటు తన కజిన్ కుమార్తెను కూడా సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు. శుక్రవారం గీతాసింగ్ పెద్ద కుమారుడు నలుగురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అతడు కన్నుమూశాడు.

కితకితలు సినిమాతో వచ్చిన పాపులారిటీతో గీతా సింగ్​కు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 50కు పైగా సినిమాల్లో గీత నటించారు. అలీ, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, బ్రహ్మానందం లాంటి టాప్ కమెడియన్స్‌తో కలిసి గీతాసింగ్ నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news