టాలీవుడ్‌లో విషాదం.. ప్రేమలోకం మూవీ డైరెక్టర్ మృతి

-

హైదరాబాద్: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ‘ప్రేమలోకం’ డైరెక్టర్ టి.కరణ్ రాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ‘చిలకపచ్చ కాపురం’,‘బొమ్మన బ్రదర్స్‌.. చందన సిస్టర్స్‌’ సినిమాలతో పాటు పలు సినిమాలకు టి. కరణ్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కాగా టి.కరణ్ ఈ నెల 16న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిత్యావసర సరుకుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా కిరణ్‌ను గౌలిపురా హనుమాన్‌ నగర్‌ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు గాయమైంది. ప్రమాదానికి కారణమైన కారు యజమాని డాక్టర్ కావడంతో ఆయనకు ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం పట్టించుకోలేదు. వైద్యం సరిగాఅందకపోవడంతో కరణ్ పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ కరణ్ మృతి చెందారు. ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కిరణ్ మృతి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు.. కరణ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news