టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు !

-

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఈడి దూకుడు పెంచింది. గతంలో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల ను విచారించిన ఈడి.. కెల్విన్, పీటర్, కమింగా అనే వ్యక్తులను నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ముగ్గురి స్టేట్మెంట్ ల ఆధారంగా విచారణ ను తీవ్ర తరం ఈడీ.. కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సినీ నటులకు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ తీసుకుని హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లు గా తెలిపారు ముగ్గురు నిందితులు.

విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తీసుకు వచ్చినట్లుగా తెలిపిన నిందితులు.. మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు డబ్బులు పంపినట్లు వెల్లడించారు. హీరో నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ క్లబ్బు మేనేజర్ కు కూడా నోటీసు ఇచ్చింది ఈడి. డ్రగ్స్ కేసులో ఎవరెవరికి సరఫరా చేశారని విషయాన్ని క్లబ్బు మేనేజర్ ద్వారా తెలుసుకోనుంది ఈడి. కెల్విన్, పీటర్ , కమింగా లా బ్యాంకు డీటెయిల్స్ తో పాటు ఆన్లైన్ లావాదేవీల వివరాలను తెప్పించుకుని దర్యాప్తు చేస్తోంది ఈడి.

Read more RELATED
Recommended to you

Latest news