హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్ మహానగరంలో ఈనెల 28వ తేదీ ఆదివారం రోజున సింహవాహిని అమ్మవారి బోనాల జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు నుంచే చర్యలు చేపట్టారు. వాహనదారులు ఈ ఆంక్షలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో లాల్‌దర్వాజా నెహ్రు విగ్రహం నుంచి సింహవాహిని ఆలయం వైపు వాహనాలకు అనుమతి ఉండదని చెప్పారు. హిమాయత్‌పుర, షంషీర్‌పురా నుంచి వచ్చే వాహనాలు లాల్‌ దర్వాజ ఆలయం వైపు కాకుండా నాగులచింత వైపు వెళ్లాలని .. చాంద్రాయణ్‌గుట్ట, ఉప్పుగూడ నుంచి వచ్చే వాహనాలు సైతం లాల్‌దర్వాజ వైపు రాకుండా చత్రినాఖ అవుట్‌ పోస్ట్ వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు  భక్తులు నడుచుకోవాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news