రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12:25 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ తెలంగాణకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో దిగుతారు. అనంతరం బిజెపి స్వాగత సభలో పాల్గొంటారు. మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

రేపు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ లో పీఎం మోడీ మీటింగ్ నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సోమాజిగూడ, రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గాలను అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news