రైల్వే ప్ర‌యాణీకుల‌కు షాక్‌: నేటి నుంచీ పెరిగిన రైల్వే చార్జీలు..

-

కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలను పెంచింది. వివిధ ప్యాసింజర్‌ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ మంగళవారం ప్రకటించారు. ఈ పెంపు 2020 జనవరి 1న ప్రారంభమైన మరుక్షణం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. సాధారణ నాన్‌ ఏసీ రైళ్లకు ఈ చార్జీలు కిలోమీటరకు ఒక పైసా పెరగనుండగా.. నాన్‌ ఏసీ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరుగుతున్నాయి.

ఇవాళ నుంచి ఏసీ తరగతులకు కిలోమీటరుకు 4 పైసల చొప్పున పెరుగుతున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటనలో తెలిపాయి. సబర్బన్‌ రైళ్లు మినహా రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్‌, తేజస్‌, హమ్‌ సఫర్‌, మహామన, గతిమాన్‌, గరీబ్‌రథ్‌, అంత్యోదయ, జనశతాబ్ది తదితర రైళ్లన్నింటికీ ఈ చార్జీల పెంపు వర్తిస్తుంది. అయితే జనవరి 1కి కన్నా ముందు బుక్‌ చేసుకున్న టికెట్లకు ఈ పెంపు వర్తించదు. దీంతోపాటు రిజర్వేషన్‌ ఫీజు, సూపర్‌ఫాస్ట్‌ చార్జీల్లో కూడా ఎటువంటి మార్పు ఉండబోదు.

Read more RELATED
Recommended to you

Latest news