సీఎం జగన్‌ను కలిసిన త్రిదండి చినజీయర్‌ స్వామి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు త్రిదండి చినజీయర్‌ స్వామి. రామాను జాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ను ఈ సందర్భంగా ఆహ్వనించారు త్రిదండి చినజీయర్‌ స్వామి.

అంతేకాదు.. ఈ సందర్భంగా చిన జీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందు లో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్‌ ను కోరారు. ఇక చినజీయర్‌ స్వామితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్‌ ను కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news