BREAKING : టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ బానోత్‌ రవి దారుణ హత్య

-

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ 8 వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ రవి దారుణ హత్య కు గురయ్యాడు. 8 వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ రవిని గొడ్డలితో.. నరికి చంపారు దుండగలు. పత్తి పాక లో కౌన్సిలర్‌ రవి పై గొడ్డలితో దాడి చేశారు కొంత మంది గుర్తు తెలియని దుండగులు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న కౌన్సిలర్‌ పై దాడి చేశారు దుండగులు.

ఈ నేపథ్యంలోనే స్థానికులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆస్పత్రికి తరలించే లోపే 8 వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ రవి.. మరణించాడు. కాగా.. మున్సిపల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బానోత్‌ రవి.. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news