Mahesh Babu:మెగా సూపర్ ట్రీట్..ఆచార్యుడికి సూపర్ స్టార్ మహేశ్ వాయిస్ ఓవర్!

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’..ఈ నెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ సభ్యులు పిక్చర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. మూవీ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..‘ఆచార్య’ ఫిల్మ్ కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

‘ఆచార్య’ చిత్రంలో ‘ధర్మస్థలి’ తో పాటు ‘సిద్ధ’, ‘ఆచార్య’ పాత్రలను ప్రేక్షకులకు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ తో పరిచయం చేయాలని కొరటాల శివ ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే మహేశ్ బాబను రిక్వెస్ట్ చేయగా, ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ సర్కి్ల్స్ టాక్. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కొరటాల శివ గతంలో మహేశ్ బాబు ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ చేశాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరుతో ‘ఆచార్య’ చేశాడు. నెక్స్ట్ జూనియ్ ఎన్టీఆర్ తో NTR30 చేయబోతున్నారు. ఇకపోతే ‘ఆచార్య’ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నదని కొరటాల శివ తెలిపారు. గురుకులం అబ్బాయిగా రామ్ చరణ్ నటించాడని తాజా ఇంటర్వ్యూలో కొరటాల వివరించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news