బీజేపీకి షాకిచ్చిన దుబ్బాక కౌన్సిలర్లు… హరీశ్ సమక్షంలో టీఆర్ఆర్‌లో చేరిక

-

సిద్దిపేట: ఇద్దరు దుబ్బాక కౌన్సిలర్లు బీజేపీకి షాక్ ఇచ్చారు. దుబ్బాక 7, 8 వార్డుల్లో దివిటి కనకయ్య, డి.బాలకృష్ణ టీఆర్ఎస్ నుంచి గెలిచారు. వీరిద్దరూ మంగళవారం బండిసంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అయితే ఈ రోజు వీళ్లిద్దరూ సొంత పార్టీ గూటికి చేరారు. కనకయ్య, బాలకృష్ణ బుధవారం హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరికి మంత్రి హరీశ్ రావు పార్టీ కండువాలు కప్పి మళ్లీ టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న టీఆర్‌ఎస్‌లోనే ఉంటామని కనకయ్య, బాలకృష్ణ తెలిపారు.

ఈ పరిణామంతో తెలంగాణ బీజేపీ కంగుతిన్నట్లైంది. ఒక్కరోజులో ఇంత మార్పా అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. అసలు ఏం జరిగి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. దుబ్బాక కౌన్సిలర్లను పార్టీలోకి తీసుకుని టీఆర్ఎస్ షాకిచ్చామని అనుకుంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం బీజేపీ నేతలకు మింగుడు పడటంలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news