కేంద్రానికి టీఆర్ఎస్ డిమాండ్లివే..!

-

టిఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను చేస్తోంది. కూలల వారిగా బీసీ జనాభా లెక్కలు సేకరించాలని పేర్కొంది. అసెంబ్లీ చేసిన తీర్మానం పై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదని….కేంద్రం దిగి వచ్చే వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేసింది. బీసీ లకు కేంద్రం లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

KCR-TRS
KCR-TRS

అదే విధంగా Sc వర్గీకరణ, st మైనారీటి రిజర్వేషన్ల పెంపుదల కోసం చేసిన అసెంబ్లీ తీర్మానాలను కేంద్రం ఆమోదించాలని పేర్కొంది. సమైఖ్య స్ఫూర్తి నిలబెట్టాలని…విభజన హామీలు నెరవేర్చాలని స్పష్టం చేసింది. ఐటీఐఆర్ ,బయ్యారం లో ఉక్కు ప్యాక్టరి,వరంగల్ లో రైల్వే కోచ్ ప్యాక్టరి ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news