TRSLP Meeting : ఇవాళ తెరాస శాసనసభ పక్ష భేటీ

-

ఇవాళ తెరాస శాసనసభ పక్షం భేటీ కానుంది. కేబినెట్ భేటీ అనంతరం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు హాజరు కానున్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పెన్షన్లు, గిరిజనులకు పోడు భూముల వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెరాస వెల్లడించింది. అయితే మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ శాసనసభ పక్షం సమావేశంలో ఏం చర్చించనున్నారనే రాజకీయాసక్తి నెలకొంది.

ప్రధానంగా కేబినెట్ తీర్మానాలు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశాలపై తెరాస ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా భాజపా దూకుడు తదితర అంశాలపై వివరించనున్నారు. మునుగోడు ఉపఎన్నికకు దారితీసిన పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలు, కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దసరా వరకు జాతీయ రాజకీయాలపై స్పష్టత ఇవ్వాలని కేసీఆర్​ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news