మాకు ట్రంపే కావాలి.. లక్షలాదిగా రోడ్డెక్కిన జనం !

-

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు మద్దతునివ్వడానికి మరియు అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు నిరసనగా అమెరికా రాజధాని వాషింగ్ టన్ డీసీలో వేలాది మంది ప్రజలు రోడ్డు ఎక్కారు. వైట్ హౌస్ సమీపంలో ఉన్న ఫ్రీడమ్ ప్లాజాలో శనివారం తెల్లవారుజామున ట్రంప్ మద్దతుదారులు లక్షాలాది సంఖ్యలో గుమిగూడారు, నిజానికి మధ్యాహ్నం నుండి విమెన్ ఫర్ అమెరికా ఫస్ట్ అనే ఒక కార్యక్రమం నిర్వహించడానికి వీరు వచ్చినట్టు చెబుతున్నారు.

trump
trump

ఈ బృందానికి టీ పార్టీ మాజీ కార్యకర్త అమీ క్రెమెర్ నాయకత్వం వహించారు. ప్లాజాలో 10,000 మంది సమావేశానికి క్రెమెర్ శుక్రవారం అనుమతి తీసుకున్నప్పటికీ, ఈ కార్యక్రమానికి అంతకంటే భారీగా జనం హాజరయ్యారని చెబుతున్నారు. స్పుత్నిక్ రిపోర్ట్ ప్రకారం, జనం “మరో నాలుగు సంవత్సరాలు”, “దొంగతనం ఆపు”, “మాకు ట్రంప్ కావాలి” అని నినాదాలు చేశారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ముందు, అధ్యక్షుడు ట్రంప్ తన మోటర్‌కేడ్ డ్రైవింగ్‌తో మద్దతుదారులకు అభివాదం చేస్తూ వెళ్ళాడు.

Read more RELATED
Recommended to you

Latest news